రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి
ABN , First Publish Date - 2023-06-26T22:45:13+05:30 IST
పట్టణంలోని హమాలీవాడ టూటౌన్ ప్రజల సౌకర్యార్ధం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు.
ఏసీసీ, జూన్ 26: పట్టణంలోని హమాలీవాడ టూటౌన్ ప్రజల సౌకర్యార్ధం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో సోమవారం గడప గడపకు వెళ్లి మోదీ సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని హమాలీవాడ రైల్వేగేటు మూతపడడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి కోసం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్నారు. కాగా మంచిర్యాల మున్సిపాలిటీ సిద్ధంగా లేదని విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం, జాజు, హరికృష్ణ, ప్రభాకర్, శ్రీదేవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి: మండలంలోని ఎల్లారం, టేకులపల్లి గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రధాని మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రెండు సార్లు గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని మోసగించారని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఎల్లారం, టేకులపల్లి గ్రామాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రాబో యే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించాలని ఆయన పిలుపుని చ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల అద్యక్షుడు బేరె రామయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, నాయకులు ప్రశాంత్, ప్రకాష్, శ్రావణ్కుమార్, నర్సింగ్, సత్యం, శంకర్, మహేందర్, నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.