దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2023-05-31T21:52:24+05:30 IST
కెరమెరి, మే 31: దశాబ్ది ఉత్సవాలను విజయ వంతం చేయాలని ఎంపీపీ మోతీరాం అన్నారు. బుధ వారం మండలపరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతి నిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
కెరమెరి, మే 31: దశాబ్ది ఉత్సవాలను విజయ వంతం చేయాలని ఎంపీపీ మోతీరాం అన్నారు. బుధ వారం మండలపరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతి నిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్న సంద ర్భంగా నిర్వహించే ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో తెలం గాణ ఏర్పడకు ముందు, ఏర్పడిన తరువాత జరిగిన మార్పులను ప్రజలకు అధికారులు వివరించాలన్నారు. అలాగే జూన్ 2 నుంచి 22 వరకు ప్రతి రోజు ఒక్కో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ధ్రుపతాబాయి, వైస్ఎంపీపీ కలాం, ఎంపీడీవో సత్యనారాయణగౌడ్, తహసీల్దార్ జమీర్, ఏపీడీ వెంకట్, ఏవో గోపికాంత్, తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: ఎంపీడీవో కార్యాల యంలో బుధవారం అడిష నల్ డీఆర్డీవో కుటుంబరావు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాల న్నారు. దశాబ్ది ఉత్సవా లను ఘనంగా నిర్వ హించాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ నానయ్య, తహసీల్దార్ మష్కూల్ అలీ, ఎంపీవో సుధాకర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కౌటాల: తెలంగాణ రాష్ట్రఆవిర్భావ దశాబ్ది ఉత్సవా లను ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ విశ్వనాథ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేది కలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 2నుంచి 22వరకు నిర్వహించే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. 21రోజులపాటు ప్రత్యే కకార్యక్రమాలను నిర్వహించాలని అందుకు గ్రామాల్లో ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో నస్కూల్లా ఖాన్, తహసీల్దార్ సాయన్న, ఎంపీవో రాజేష్, ఏపీవో పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.