కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ

ABN , First Publish Date - 2023-05-31T22:28:12+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికి 2లక్షల రూపాయల పంట రుణమాఫీ ఒకేదఫాలో చేస్తామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ)అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు.

 కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ
లక్ష్మికాంతపూర్‌లో ప్రజలకు క్యాలెండర్‌ అందజేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

దండేపల్లి,మే 31: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికి 2లక్షల రూపాయల పంట రుణమాఫీ ఒకేదఫాలో చేస్తామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ)అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం లక్ష్మికాంతపూర్‌ గ్రామంలో బుధవారం గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరాకు 15వేలు, భూమిలేని రైతు కూలీలకు ఎడాదికి 12వేల రూపాయలు ఇస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు యేటా 12వేల రూపాయాలు చెల్లిస్తామన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ అనుసంధానం, పంట బీమా, నూతన వ్యవసాయచట్టం, వరికి మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా పథకాల పేరిట మోసం చేస్తున్నారని చెప్పారు. రాబోయ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలందరు ఆదరించి ప్రేంసాగర్‌రావు అఽధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మాజీ ఎంపీపీలు జాబు కాంతరావు. అక్కల శకుంతల, నాయకులు జాబు మూర్తి,సైడం కార్తీక్‌, జాబు వెంకన్న, గాజుల రాజన్న, సిరికూరి గంగన్న, పసర్తి శంకరయ్య, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T22:28:12+05:30 IST