Kumaram Bheem Asipabad: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ABN , First Publish Date - 2023-08-02T22:03:29+05:30 IST
ఆసిఫాబాద్, ఆగస్టు 2: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 2: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జడ్పీ సీఈవో రత్నమా లతో కలిసి స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామ పంచాయతీల్లో చేపట్టే మౌలిక వసతులపై ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో చేప ట్టిన వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్వచ్ఛభారత్ మిషన్ సభ్యులు ఎంపికైన గ్రామపంచాయతీల్లో పర్యటించనున్నందున ఆయాగ్రామపంచా యతీ ల్లో వాల్ పేయింటింగ్, డంపింగ్ యార్డుల నిర్వహణ, రహదారులు, మురుగు కాలువల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలిస్తారని అన్నారు. సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు, పూర్తిసమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు.