Share News

Kumaram Bheem Asifabad: గిరిజన మహిళకు జడ్పీచైర్‌పర్సన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:49 PM

బెజ్జూరు, డిసెంబరు 7: గిరిజన మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వకపోతే ఆందోళన చేపడుతామని ఆదిలాబాద్‌ మాజీ జడ్పీచైర్మన్‌ సిడాం గణపతి అన్నారు. ఆదివారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

Kumaram Bheem Asifabad:   గిరిజన మహిళకు జడ్పీచైర్‌పర్సన్‌ ఇవ్వాలి

- లేకపోతే ఆందోళన చేస్తాం

- ఆదిలాబాద్‌ మాజీ జడ్పీచైర్మన్‌ సిడాం గణపతి

బెజ్జూరు, డిసెంబరు 7: గిరిజన మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వకపోతే ఆందోళన చేపడుతామని ఆదిలాబాద్‌ మాజీ జడ్పీచైర్మన్‌ సిడాం గణపతి అన్నారు. ఆదివారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గిరిజన మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టాలన్నారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన నాయకులు చిన్నయ్య, భిక్షపతి, రాజారాం, ప్రకాష్‌, అరుణ్‌, రాజు, మధుకర్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:49 PM