Kumaram Bheem Asifabad: కొండా లక్ష్మణ్బాపూజీ వర్ధంతి
ABN , First Publish Date - 2023-09-21T22:25:41+05:30 IST
వాంకిడి/ఆసిఫాబాద్ రూరల్/బెజ్జూరు/జైనూరు/కాగజ్నగర్, సెప్టెంబరు 21: మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్బాపూజీ వర్ధంతిని గురువారం లక్ష్మణ్ సేవాసదన్, పద్మ శాలిసంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వాంకిడి/ఆసిఫాబాద్ రూరల్/బెజ్జూరు/జైనూరు/కాగజ్నగర్, సెప్టెంబరు 21: మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్బాపూజీ వర్ధంతిని గురువారం లక్ష్మణ్ సేవాసదన్, పద్మ శాలిసంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో లక్ష్మణ్ సేవాసదన్సంస్థ చైర్మన్ గాదే అవినాష్, వైస్ చైర్మన్ అశోక్, అఖిలభారత పద్మశాలిసంఘం రాష్ట్ర కార్యదర్శి గడ్డం జగన్నాథం, జిల్లా పద్మశాలి అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు, సంఘంసభ్యులు గాదే అనిల్ ఎంగలిసాయి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో పద్మశాలిసంఘం భవనంలో కొండా లక్ష్మణ్బాపూజీ చిత్రపటానికి పద్మశాలిసంఘం జిల్లాఅధ్యక్షుడు ఆంజనేయులు, లింగయ్య, రుషి, ధర్మయ్య, మోహన్, శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బెజ్జూరు మండల కేంద్రంలో పద్మశాలిసేవాసంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమం లో సభ్యులు వెంకేటష్, రమేష్, శంకర్, గణేష్, శ్రీనివాస్, శేఖర్, సంతోష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. జైనూరులో జరిగిన వర్ధంతిలో అంబేద్కర్సంఘం అధ్యక్షుడు కాంబ్లే అన్నారావ్, ఉపాధ్యక్షుడు కాంబ్లే అశోక్, భుతాలె వెంకటేష్ పాల్గొన్నారు. కాగజ్నగర్లో పద్మశాలి సేవాసంఘం నాయకులు కుడిక్యాల రాజమౌలి, కేదారి, గుళ్లపల్లి ఆనంద్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్బాపూజీ ఆశయాల సాధన కోసం అంతా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నల్ల కనకయ్య, సామల రాజన్న, మల్లయ్య, గుళ్లపల్లి నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.