Kumaram Bheem Asifabad: స్వర్ణకారులకు ఉపాధి కల్పించాలి

ABN , First Publish Date - 2023-09-04T23:14:25+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 4: కార్పొరేట్‌ దుకాణాల రాకతో చితికి పోయిన స్వర్ణకారులకు ఉపాధికల్పించాలని ఆ సంఘం జిల్లాఅధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఒకరోజు నిరసనదీక్ష నిర్వ హించారు.

Kumaram Bheem Asifabad:  స్వర్ణకారులకు ఉపాధి కల్పించాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 4: కార్పొరేట్‌ దుకాణాల రాకతో చితికి పోయిన స్వర్ణకారులకు ఉపాధికల్పించాలని ఆ సంఘం జిల్లాఅధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఒకరోజు నిరసనదీక్ష నిర్వ హించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులకు సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 5మెన్‌కమిటీ రిపోర్టు యథాతథంగా అమలు చేయాలన్నారు. తమిళనాడులో మాదిరిగా రాష్ట్రంలో కూడా స్వర్ణకారుల వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. జీవోనం.272పకడ్బందీగా అమలు చేస్తూ వివాహానికి సంధించిన పుస్తెలు, మట్టెలు, ప్రధానపు ఉంగరం, లక్ష్మిరూపులు లాంటి నాలుగుపనులు స్వర్ణకారులే చేసే విధంగా జువెలరీ షాపులలో వీటిని అమ్మ కుండా నిబంధనలు విధించాలన్నారు. కార్పొరేట్‌దుకాణాలతో స్వర్ణకారుల బతుకులు చిధ్రమవుతున్నా యన్నారు. వృత్తినే నమ్ముకున్న స్వర్ణకారులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు వరప్రసాద్‌, మహేష్‌, రామయ్యచారి, పురుషోత్తం, గంగాధర్‌, కిష్టయ్య, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:14:25+05:30 IST