Share News

Kumaram Bheem Asifabad: జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు నిర్వహించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:14 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 18: జడ్పీచైర్‌పర్సన్‌ పదవికి తక్షణమే ఎన్నికలు నిర్వ హించి ఎస్టీమహిళను ఎన్నుకునేలా చర్యలుచేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Kumaram Bheem Asifabad:  జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు నిర్వహించాలి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 18: జడ్పీచైర్‌పర్సన్‌ పదవికి తక్షణమే ఎన్నికలు నిర్వ హించి ఎస్టీమహిళను ఎన్నుకునేలా చర్యలుచేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్‌లోని రాష్ట్రఎన్నికల సంఘం అధికారి సి పార్థసా రథికి ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ఏరియాలోని ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎస్టీ(మహిళ)కి రిజర్వు చేసిన స్థానంలో జనరల్‌ కేటగిరికి చెందిన జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావును ఎంపికచేయడం రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమ న్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి కాలయాపన చేయకుండా తక్షణమే ఆ స్థానంలో ఎస్టీ(మహిళ)ని ఎంపికచేయాలని కోరారు. ప్రభుత్వంప్రత్యేక చొరవచూపి ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఆయనవెంట నాయకులు హర్షద్‌ హుస్సేన్‌, విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:14 PM