Share News

Kumaram Bheem Asifabad: పోలింగ్‌ కేంద్రాల సమస్యను పరిష్కరించేందుకు కృషి

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:12 PM

కాగజ్‌నగర్‌, డిసెంబరు 18: త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల కోసం నియోజకవర్గంలోని వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీవో సురేష్‌ తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Kumaram Bheem Asifabad:   పోలింగ్‌ కేంద్రాల సమస్యను పరిష్కరించేందుకు కృషి

-ఆర్డీవో సురేష్‌

కాగజ్‌నగర్‌, డిసెంబరు 18: త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల కోసం నియోజకవర్గంలోని వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీవో సురేష్‌ తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల జాబితాను ఏర్పాటు చేశామని ఇందులోని సమస్యలపై తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు వివిధ పోలింగ్‌ కేంద్రాల సమస్యలపై ఆర్డీవోకు వివరించారు. వాటిని పరిష్కరించాలి సిబ్బంది సూచించారు. సమావేశంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ప్రమోద్‌, ఆయామండలాల తహసీల్దార్లు, పార్టీల నాయకులు నక్క మనోహర్‌, ప్రసాద్‌, ముంజం ఆనంద్‌కుమార్‌, శంకర్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:12 PM