సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-03-30T22:40:30+05:30 IST

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్‌టీలకు 12 నెలల వేతనాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపు తూ గురువారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్‌టీలు క్షీరాభిషేకం చేశారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 30: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్‌టీలకు 12 నెలల వేతనాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపు తూ గురువారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్‌టీలు క్షీరాభిషేకం చేశారు. సీఆర్‌టీ సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ మల్లేష్‌, గౌరవాధ్య క్షుడు నైతం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి బాపు రావు, నాయకులు శ్రీనివాస్‌, రాథోడ్‌ , కిష్టంరాజు, సురేష్‌, భీమానాయక్‌, శంకర్‌, కమలాకర్‌, కార్తీక్‌, సమ్మయ్య, బాబుసింగ్‌, వాణి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T22:40:30+05:30 IST