ప్రాణహితను పాతరపెట్టిన కేసీఆర్ను గద్దెదించాలి: పాల్వాయి హరీష్బాబు
ABN , First Publish Date - 2023-06-07T21:43:21+05:30 IST
చింతలమానేపల్లి, జూన్ 7: ప్రాణహిత ప్రాజెక్టును పాతరపెట్టిన కేసీఆర్ప్రభుత్వాన్ని గద్దెదించాలని బీజేపీ నియోజకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని నంది కొండ,జాజులగూడ, కారురెబ్బెన,టేకంగూడ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు.
చింతలమానేపల్లి, జూన్ 7: ప్రాణహిత ప్రాజెక్టును పాతరపెట్టిన కేసీఆర్ప్రభుత్వాన్ని గద్దెదించాలని బీజేపీ నియోజకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని నంది కొండ,జాజులగూడ, కారురెబ్బెన,టేకంగూడ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ప్రాణహిత ప్రాజెక్టుకు పాతరవేసి కాళేశ్వరం కట్టి మనభూములను ఎడారిగా మార్చిన ఘనత కేసీ ఆర్కే దక్కిందని దుయ్యబట్టారు. గతంలో ప్రాణహిత కాలువకు అడ్డంపడైనా నీళ్లు ఇస్తామని గొప్పలుచెప్పి కోనప్ప ఎందుకు అసెంబ్లీలో ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఆయనవెంట నాయకు లు మల్లయ్య, పురుషోత్తమచారి, ఉమామహేష్, రమేష్, కారు, శంకర్ తదితరులున్నారు.