ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందం

ABN , First Publish Date - 2023-01-09T22:19:15+05:30 IST

జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సోమవారం కాయ కల్ప బృందం సభ్యులు పరిశీలించారు.

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందం

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 9: జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సోమవారం కాయ కల్ప బృందం సభ్యులు పరిశీలించారు. బోధన్‌ నుంచి కాయకల్ప బృందం సభ్యులు, వైద్యులు శ్రీమన్నారాయ ణతో కలిసి పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ యేటా అందించే కాయకల్ప అవార్డును ఇంటర్నల్‌ పీగ్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా బృందం సభ్యులు ఆసు పత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగా లను సందర్శించి స్వచ్ఛత, సదుపాయాలు, బయో మెడికల్‌ వేస్టేజ్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌, పారిశుధ్య రికా ర్డుల నిర్వహణ, సిబ్బంది పని తీరు, ప్రసవాల సంఖ్య, ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య, ఆసుపత్రిలో జరుగు తున్న అభివృద్ధి, ఆసుపత్రి నిర్వహణ అంశాలపై సం తృప్తి వ్యక్తంచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ క్వాలిటీ అధికారి శివకుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ సోఫిల్‌, క్వాలి టీ మేనేజర్‌రాము, హెడ్‌నర్సు సుచరిత, పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T22:19:18+05:30 IST