దశాబ్ది ఉత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ను విస్మరించడం సరికాదు
ABN , First Publish Date - 2023-06-02T22:17:36+05:30 IST
ఆసిఫాబాద్, జూన్ 2: రాష్ట్రఅవతరణ దశాబ్దిఉత్సవాల కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రొటోకాల్ను విస్మరించడం సరికాదని జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ కనక యాదవరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, అజయ్కుమార్, మార్కెట్కమిటీ చైర్మన్ గాదవేణిమల్లేష్, ఎంపీపీమల్లిఖార్జున్ అన్నారు.
ఆసిఫాబాద్, జూన్ 2: రాష్ట్రఅవతరణ దశాబ్దిఉత్సవాల కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రొటోకాల్ను విస్మరించడం సరికాదని జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ కనక యాదవరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, అజయ్కుమార్, మార్కెట్కమిటీ చైర్మన్ గాదవేణిమల్లేష్, ఎంపీపీమల్లిఖార్జున్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్, జడ్పీటీసీలు, మార్కెట్కమిటీ చైర్మన్, ఎంపీపీలను వేదికపైకి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ను విస్మరించారన్నారు. తమను అవమానపరిచారని వారు అవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా అధికారులు కార్యక్రమాలకు ప్రొటోకాల్ను అనుసరించాలన్నారు.