గుండి వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ABN , First Publish Date - 2023-03-17T22:29:29+05:30 IST

ఆసిఫాబాద్‌, మార్చి 17: మండలంలోని గుండి వంతెన నిర్మాణపనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌హేమంత్‌బోర్కడే అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్నగుండి వంతెన పనులను పరిశీలించారు.

గుండి వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ఆసిఫాబాద్‌, మార్చి 17: మండలంలోని గుండి వంతెన నిర్మాణపనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌హేమంత్‌బోర్కడే అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్నగుండి వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది కురి సినవర్షాలతో పిల్లర్లపై నుంచి వరదనీరు ప్రవహించడంతో అవి కొంతమేరకు దెబ్బతిన్నాయని వంతె న నిర్మాణానికి రీడిజైన్‌చేసి రీటెండర్‌ న్రిర్వహించి కాంట్రాక్టర్‌కు పనులను అప్ప గించామన్నారు. జూన్‌15లోగా నిర్మాణపనులు పూర్తిచేయాలని ఇంజనీ రింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ గాద వేణి మల్లేష్‌, డీఈ కృష్ణ, ఈఈ రామ్మోహన్‌, ఏఈ రాంకిరణ్‌, మాజీ ఎంపీటీసీ రవిందర్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-17T22:29:29+05:30 IST