పవర్‌ ప్లాంటు ఉదోగులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-02-06T22:17:49+05:30 IST

శాలివాహన పవర్‌ ప్లాంటు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు, ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

పవర్‌ ప్లాంటు ఉదోగులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఏసీసీ, ఫిబ్రవరి 6: శాలివాహన పవర్‌ ప్లాంటు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు, ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ 6 మెగావాట్ల బయోమాస్‌ పవర్‌ ప్లాం ట్‌ను ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్‌ పర్చెజింగ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ) ముగిసిందన్నారు. దాంతో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసి కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్‌ జీతాలు, బోనస్‌లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహి స్తుందన్నారు. పవర్‌ ప్లాంటుపై ఆధారపడి ప్రత్యక్షంగా 200 కుటుంబాలు, పరోక్షంగా 500 మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్లాంటును మూసి వేయడంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్ధితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుంటాల శంకర్‌, శ్రీనివాస్‌, శెట్టి శ్రీనివాస్‌, సంగం ప్రకాష్‌, సత్యనారాయణ, ప్రకాష్‌, రాజయ్య, ఆనంద్‌రావు, పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:17:52+05:30 IST