డిగ్రీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:17 PM
జన్నారంలో డిగ్రీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని సోమవారం టీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు డిగ్రీ విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
జన్నారం, డిసెంబరు 18: జన్నారంలో డిగ్రీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని సోమవారం టీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు డిగ్రీ విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి చంద్రశేఖర్ మాట్లా డుతూ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షెట్టిపేటలో డిగ్రీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, అంతదూరం వెళ్లి పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జన్నారంలోనే డిగ్రీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్ఐ సతీష్ సంఘటన స్థలానికి వెళ్లి విద్యా ర్థులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. జియావుద్దీన్, మనీష్, విద్యార్థులు పాల్గొన్నారు.