ప్రజావాణి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు: డీఆర్వో రాజేశ్వర్
ABN , First Publish Date - 2023-06-26T22:50:51+05:30 IST
ఆసిఫాబాద్, జూన్ 26: ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని డీఆర్వో రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీక రించారు.
ఆసిఫాబాద్, జూన్ 26: ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని డీఆర్వో రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీక రించారు. సిర్పూర్(టి) మండలం పారిగాం గ్రామానికిచెందిన సత్పుతె సురేఖ, వెంకట్రా వుపేటకు చెందిన వందనబాయి, ఆసిఫా బాద్ మండలం అడ గ్రామానికి చెందిన విమలాబాయి, ఆసిఫాబాద్ మండలం బాబా పూర్కు చెందిన హనుమక్క తమకు ఇంటి స్థలం ఉందని ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకంకింద ఆర్థిక సహయం అందించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మం డలకేంద్రానికి చెందిన సునీత, కెరమెరి మండలం నిశానికి చెందిన జయసుధ తాము కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నామని రెండుపడక గదుల ఇళ్ల పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు అంద జేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు.