విద్వేష పాలకులను గద్దె దించే వరకు పోరాటం

ABN , First Publish Date - 2023-03-28T23:30:23+05:30 IST

అధికారం కోసం ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్న బీజేపీ పాలకులను గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్‌ అన్నారు.

విద్వేష పాలకులను గద్దె దించే వరకు పోరాటం
గద్వాలలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్‌

గద్వాల టౌన్‌, మార్చి 28 : అధికారం కోసం ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్న బీజేపీ పాలకులను గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్‌ అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రను మంగళవారం పట్టణంలోని చింతలపేట వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, న్యాయవ్యవస్థను సైతం తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమణ, రమ, పరం జ్యోతి, విజయ్‌, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు వీవీ నర సింహ, ఉప్పేరు నరసింహ, నర్మద, రఘు, రామకృష్ణ, నరసింహులు, పరశురాం, ప్రవీణ్‌, దేవదాసు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-28T23:30:45+05:30 IST