Samsung: పాంటోన్ సర్టిఫైడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ స్మార్ట్‌టీవీలు.. ధరెంతంటే...

ABN , First Publish Date - 2023-06-16T18:15:40+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Samsung: పాంటోన్ సర్టిఫైడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ స్మార్ట్‌టీవీలు.. ధరెంతంటే...

హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పాంటోన్ సర్టిఫైడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ ఓఎల్ఈడీ టీవీ సిరీస్‌ను భారత (India) మార్కెట్‌లో విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది.

భారత మార్కెట్‌లో శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీ సిరీస్‌ ధరలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీ సిరీస్‌ ప్రారంభ ధర రూ. 1,69,990 ఉంటుంది. ఎస్95సీ - ఎస్90సీ సిరీస్‌లో మూడు రకాల సైజ్‌లో టీవీలను అందుబాటులోకి తెచ్చారు. 55, 65, 77- అంగుళాల శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీలను ప్రవేశపెట్టారు. ఈ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు 20 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఈఎంఐ ( EMI) ద్వారా ప్రారంభం రూ. 2,990 చెల్లించి టీవీని తీసుకెళ్లవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి టీవీలపై రెండు సంవత్సరాలపాటు వారెంటీ ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2023-06-16T18:26:24+05:30 IST