Samsung: అద్భుత ఫీచర్లతో శాంసంగ్ స్మార్ట్‌టీవీల విడుదల... ధరెంతో తెలుసా.. షాక్ అవాల్సిందే..

ABN , First Publish Date - 2023-05-10T20:14:25+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ అండ్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది.

Samsung: అద్భుత ఫీచర్లతో శాంసంగ్ స్మార్ట్‌టీవీల విడుదల... ధరెంతో తెలుసా.. షాక్ అవాల్సిందే..

హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ అండ్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా భారత మార్కెట్‌లో (India Market) అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే 2023, డాల్బీ అట్మోస్‌ 4కే స్మార్ట్ టీవీలను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.

స్మార్ట్ టెలివిజన్ టీవీలు (Smart Television TVs) డిస్ ప్లే పరిమాణంలో 50 నుంచి 98 అంగుళాల వరకు ఉంటాయి. భారత మార్కెట్‌లో శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే 2023 స్మార్ట్ టీవీ రూ. ప్రారంభ ధర రూ. 3,14,990 ఉంటుంది. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే స్మార్ట్ టీవీలు 98-అంగుళాలు, 85-అంగుళాలు, 75-అంగుళాలు, 65-అంగుళాల్లో అందుబాటులో ఉంటాయి. డాల్బీ అట్మోస్‌ శాంసంగ్ 4కే స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 1,41,990 ఉంటుందని కంపెనీ తెలిపింది. డాల్బీ అట్మోస్‌ 4కే శాంసంగ్ స్మార్ట్ టీవీలు 85-అంగుళాలు, 75-అంగుళాలు, 65-అంగుళాలు, 55-అంగుళాలు, 50-అంగుళాల్లో లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2023-05-10T20:18:04+05:30 IST