Redmi: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‌మి 12ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN , First Publish Date - 2023-05-10T19:18:23+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మార్కెట్‌లో విడుదల చేస్తోంది.

Redmi: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రెడ్‌మి 12ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి (Redmi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మార్కెట్‌లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ పోలాండ్ (Poland) మార్కెట్‌లో 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతోపాటు 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్డుతో రెడ్‌మి నోట్ 12ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. రెడ్‌మి నోట్ 12ఎస్ ఫోన్ 6.43 అంగుళాల పూర్తి హెచ్‌డీ ఆమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

పోలాండ్ మార్కెట్లో మాత్రమే రెడ్‌మి నోట్ 12ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. 6జీబీ- 128జీబీ అండ్ 8జీబీ - 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. రెడ్‌మి నోట్ 12ఎస్ ఫోన్‌ను 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో సంస్థ ఆఫర్ చేస్తోంది. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైపు-సీ చార్జింగ్ పోర్టు ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, ప్రింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఫేష్ అన్ లాక్ ఫీచర్స్ ఉన్నాయి.

Updated Date - 2023-05-10T19:23:02+05:30 IST