గ్రూప్‌-1లో ఎస్టీ స్టడీ సెంటర్‌ విద్యార్థుల సత్తా

ABN , First Publish Date - 2023-01-26T04:35:39+05:30 IST

గిరిజన స్టడీ సర్కిళ్లలో కోచింగ్‌ తీసుకుని గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన వారిలో 123 మంది మెయిన్స్‌కు ఎంపికవ్వడంపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

గ్రూప్‌-1లో ఎస్టీ స్టడీ సెంటర్‌ విద్యార్థుల సత్తా

మెయిన్స్‌కు 123 మంది ఎంపిక.. వీరికి రూ.5 వేల స్టైపెండ్‌

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన స్టడీ సర్కిళ్లలో కోచింగ్‌ తీసుకుని గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన వారిలో 123 మంది మెయిన్స్‌కు ఎంపికవ్వడంపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన వారందరినీ బుధవారం తెలుగు సంక్షేమ భవన్‌లో ఆమె అభినందించారు. మంత్రి మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ స్టడీ సర్కిల్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్టడీ సెంటర్లలో కోచింగ్‌ తీసుకుని మెయిన్స్‌కు ఎంపికైన వారికి ట్యాబ్‌లతోపాటు కోచింగ్‌ పూర్తయ్యే వరకు నెలకు రూ.5వేల స్టైపెండ్‌ అందజేయనున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-01-26T04:35:40+05:30 IST