Share News

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

ABN , First Publish Date - 2023-11-23T22:54:13+05:30 IST

విశాఖలో జరిగిన టీ20లో మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది.

T20: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఇండియా 209 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌: సూర్యకుమార్‌ 80, ఇషాన్ కిషన్‌ 58 పరుగులు చేశారు.

విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు వీరవిహారం చేశారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో అంతగా రాణించని జాష్ ఇంగ్లీస్ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 50 బాల్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 110 రన్స్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లీస్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు. అతడికి స్టీవ్ స్మిత్ (52) మంచి సహకారం అందించాడు. మాథ్యూ షార్ట్ (13) విఫలమైనా రెండో వికెట్‌కు స్మిత్-ఇంగ్లీస్ 130 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

Updated Date - 2023-11-23T23:03:17+05:30 IST