IPL 2023: బెంగళూరుపై టాస్ గెలిచిన రాజస్థాన్.. జోరు కొనసాగించేనా?

ABN , First Publish Date - 2023-04-23T15:18:01+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాయల్

IPL 2023: బెంగళూరుపై టాస్ గెలిచిన రాజస్థాన్.. జోరు కొనసాగించేనా?

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)-రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, సాయంత్రం ఏడున్నర గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడతాయి.

మరికాసేపట్లో బెంగళూరుతో జరగనున్న పోరులో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గత మ్యాచ్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.

మరోవైపు, పంజాబ్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో నెగ్గిన బెంగళూరు అదే జోరు ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ ఫా డుప్లెసిస్(Faf du Plessis) జట్టుకు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ(Virat Kohli)నే జట్టును నడిపించనున్నాడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం డుప్లెసిస్ బ్యాటింగ్ చేస్తాడు.

Updated Date - 2023-04-23T15:18:01+05:30 IST