IPL 2023: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో దుమ్మురేపేందుకు ఈ ఇద్దరు ఈ హీరోయిన్లు రెడీ!

ABN , First Publish Date - 2023-03-30T18:36:53+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో

IPL 2023: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో దుమ్మురేపేందుకు ఈ ఇద్దరు ఈ హీరోయిన్లు రెడీ!

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగనున్న ఆరంభ వేడుకలు ఈసారి అదిరిపోనున్నాయి. తారల డ్యాన్సులతో స్టేడియం హోరెత్తనుంది. దక్షిణాది హీరోయిన్లు రష్మిక మందన్న(Rashmika Mandanna), తమన్నా భాటియా(Tamanna Bhatia)లు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. సింగర్ అరిజిత్ సింగ్(Arijit Singh) తన పాటల మాయాజాలంలో ఐపీఎల్ ప్రేక్షకులను తడిపేయనున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన రష్మిక.. పుష్ప(Pushpa) సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఇక, మిల్కీ బ్యూటీ తమన్నా గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. వీరిద్దరికీ అరిజిత్ సింగ్ తోడుకావడంతో నరేంద్రమోదీ స్టేడియం మోతెక్కిపోనుంది.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-నాలుగుసార్లు ట్రీఫీని కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తలపడతాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు స్వదేశానికి దూరంగా జరిగిన ఐపీఎల్ ఈసారి పూర్తిస్థాయిలో భారత్‌లో జరగబోతోంది. దీంతో ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఐపీఎల్ రంగం సిద్ధం చేసిందని, పలువురు సూపర్ స్టార్లు, హీరోయిన్లు ప్రారంభ వేడుకల్లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, అవేవీ నిజం కాదని తాజాగా తేలింది. రష్మిక మందన్న, తమన్నా భాటియా, అరిజిత్ సింగ్ మాత్రమే ప్రదర్శన ఇవ్వనున్నట్టు ఐపీఎల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Updated Date - 2023-03-30T18:36:53+05:30 IST