Crime: వారం రోజుల క్రితమే కొత్తగా అద్దెకు దిగిన ఫ్యామిలీ.. సడన్‌గా ఆ ఇంట్లోంచి తీవ్రమైన దుర్వాసన.. యజమానికి డౌటొచ్చి వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-02T19:15:52+05:30 IST

వారం రోజుల క్రితమే ఓ కుటుంబం కొత్త అద్దె ఇంట్లోకి దిగింది. కానీ, ఇంతలోనే మహిళ మరణించింది. భర్త, పిల్లల జాడ మాత్రం తెలియరాలేదు. గువహాటిలో గురువారం వెలుగు చూసిన ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Crime: వారం రోజుల క్రితమే కొత్తగా అద్దెకు దిగిన ఫ్యామిలీ.. సడన్‌గా ఆ ఇంట్లోంచి తీవ్రమైన దుర్వాసన.. యజమానికి డౌటొచ్చి వెళ్లి చూస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: వారం రోజుల క్రితమే ఓ ఫ్యామిలీ ఆ ఇంట్లో అద్దెకు దిగింది. భార్య, భర్త, పిల్లలు..చక్కని కుటుంబం వారిది. కానీ, వారం రోజులుగా ఆ ఇంట్లో చడీచప్పుడూ లేకుండా పోయింది. ఎప్పుడూ సందడిగా ఉండేవాళ్లు ఎందుకు సైలెంట్ అయిపోయారో యజమానికి అర్థంకాలేదు. ఆ తరువాత మరొ రెండు రోజులకు ఇంట్లోంచి భరించలేని దుర్వాసన రావడం ప్రారంభించింది. దీంతో, అనుమానమొచ్చిన ఇంటి యజమాని వాళ్ల ఇంటికి వెళ్లి చూడగా మహిళ శవం కనిపించింది. గువహటీ నగరంలోని(Guwahati) లాలన్ గావ్ ప్రాంతంలో గురువారం వెలుగు చూసిందీ ఘటన.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వారికి ఓ పెద్ద పెట్టెలో మహిళ (35) మృతదేహం కనిపించింది. భర్త, పిల్లల జాడ మాత్రం లభించలేదు. మృతురాలిని భఖంతీ బైష్యాగా గుర్తించారు. అయితే, రెండు రోజుల క్రితమే మహిళను సజీవంగా చూసినట్టు ఇంటి యజమాని పోలీసులకు చెప్పాడు. ఇంతలోనే ఆమె విగతజీవిగా మారిపోయిందని చెప్పాడు.

అయితే, మహిళ భర్త, పిల్లలు ఏమైపోయారనే దానిపై స్థానికంగా రకరకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. మహిళ మరణానికి ముందే ఆమె భర్త పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడే ఆమెను హత్య చేసి ఉంటాడని స్థానికుల్లో కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ భర్త, పిల్లల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Updated Date - 2023-06-02T19:15:55+05:30 IST