wild elephant: ‘నాతోనే సెల్ఫీయా....?’

ABN , First Publish Date - 2023-01-31T10:26:39+05:30 IST

సెల్పీ తీసుకొనేందుకు యత్నించిన వారిని అడవి ఏనుగు తరిమిన సంఘటన కోయంబత్తూరు(Coimbatore) జిల్లాలో చోటుచేసుకుంది.

wild elephant: ‘నాతోనే సెల్ఫీయా....?’

- భక్తులను తరిమిన అడవి ఏనుగు

పెరంబూర్‌(చెన్నై), జనవరి 30: సెల్పీ తీసుకొనేందుకు యత్నించిన వారిని అడవి ఏనుగు తరిమిన సంఘటన కోయంబత్తూరు(Coimbatore) జిల్లాలో చోటుచేసుకుంది. వాల్పారై సమీపంలోని తేయాకు తోటల్లోకి ఆహారం కోసం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు వస్తుంటాయి. ప్రస్తుతం వాల్పారై సమీపంలోని న్యూ గార్డెన్‌ పొల్లాచ్చి రోడ్డులోని కాళియమ్మన్‌ ఆలయ ఉత్సవాలు జరుగుతుండగా, పరిసర ప్రాంతాలకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. అలా వస్తూ తోటల్లో సంచరిస్తున్న ఏనుగుల సమీపంలో నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, సెల్పీ తీసుకొనే వారి అరుపులతో ఆగ్రహం చెందిన ఓ ఏనుగు వారి వెంటపడి తరుముతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన, తోటల్లో సంచరించే ఏనుగులు సహా వన్యమృగాలకు కోపం తెప్పించేలా ప్రవర్తించరాదని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-01-31T10:26:40+05:30 IST