Viral Video: కాసేపట్లో చనిపోవడం ఖాయం అనుకున్న పక్షి నోటి వద్ద బాటిల్‌తో నీళ్లను పోశాడో వ్యక్తి.. క్షణాల్లోనే జరిగిందో అద్భుతం..!

ABN , First Publish Date - 2023-05-26T22:25:12+05:30 IST

దాహంతో మరణం అంచుకు నేరుకున్న ఓ బుజ్జి పిట్టను రెండు చుక్కల నీళ్లతో కాపాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: కాసేపట్లో చనిపోవడం ఖాయం అనుకున్న పక్షి నోటి వద్ద బాటిల్‌తో నీళ్లను పోశాడో వ్యక్తి.. క్షణాల్లోనే జరిగిందో అద్భుతం..!

ఇంటర్నెట్ డెస్క్: బుజ్జి పిట్ట.. మరణం అంచుకు చేరుకుంది. దాహంతో అల్లాడుతూ ఎగరలేక నేలపై పడి కొట్టుకుంటోంది. అప్పుడో ఇప్పుడో దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కానీ దాని అదృష్టం బాగుంది. ఓ మనసున్న మారాజు దృష్టి దానిపై పడింది. బుజ్జి పిట్ట అలా గిలగిలా కొట్టుకోవడం చూడలేకపోయాడా వ్యక్తి. వెంటనే తన వద్ద ఉన్న నీళ్ల బాటిల్‌లో చెంచాడు నీళ్లు తీసి దానిపై చిలకరించాడు. బుజ్జి పిట్ట గొంతుకలోకి రెండు బోట్లు నీరు చేరగానే దానికి పోతున్న ప్రాణాలు తిరిగొచ్చాయి. వెంటనే నిలబడి మరో రెండు చక్కల నీళ్లు తాగిందా బుజ్జి పిట్ట. అద్భుతం అంటే ఇదే.. ప్రకృతి ఓ అద్భుతం..మనసున్న మనిషి అత్యద్భుతం!

Updated Date - 2023-05-26T22:25:16+05:30 IST