డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. 2021లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే..

ABN , First Publish Date - 2023-01-02T15:36:18+05:30 IST

మద్యం సేవించి వాహనం నడపడం ఎంతో ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాటిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఎక్కువ. కొన్నేళ్లుగా ఆ జాబితాలోకి మరో కారణం కూడా చేరింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఉపయోగించడం కూడా అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది.

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. 2021లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే..

మద్యం సేవించి వాహనం నడపడం ఎంతో ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాటిల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఎక్కువ. కొన్నేళ్లుగా ఆ జాబితాలోకి మరో కారణం కూడా చేరింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ (Mobile phone while Driving) ఉపయోగించడం కూడా అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు (Road Accidents) కారణమవుతోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నివేదిక ప్రకారం, మొబైల్ వాడుతూ డ్రైవ్ చేయడం కారణంగా 2021 సంవత్సరంలో మొత్తం 1,997 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 1,040 మంది ప్రాణాలు కోల్పోయారు.

`భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు- 2021' (Road accidents in India- 2021) పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం సిగ్నల్ జంప్ చేయడం వల్ల 555 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందువల్ల 222 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 2021లో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల కారణంగా 1,53,972 మంది ప్రాణాలు కోల్పోగా, 3,84,448 మంది గాయపడ్డారు. ఇక, రోడ్లు బాగా లేకపోవడం, గుంతల కారణంగా 2021లో 1481 మంది చనిపోయినట్టు నివేదిక పేర్కొంది.

Updated Date - 2023-01-02T15:36:19+05:30 IST