Train bogie: సీఎం కార్యాలయంగా రైలు బోగీ

ABN , First Publish Date - 2023-02-02T10:05:57+05:30 IST

ఓ రైల్వే బోగీ కొన్ని గంటలపాటు సీఎం కార్యాలయంగా మారిపోయింది. ఇదేంటంటారా?.. అయితే మీరు తమిళనాడు రావాల్సిందే. వివరాలి

Train bogie: సీఎం కార్యాలయంగా రైలు బోగీ

- ప్రయాణంలోనే స్టాలిన్‌ అధికారులతో సమావేశం

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఓ రైల్వే బోగీ కొన్ని గంటలపాటు సీఎం కార్యాలయంగా మారిపోయింది. ఇదేంటంటారా?.. అయితే మీరు తమిళనాడు రావాల్సిందే. వివరాలిలా వున్నాయి... సీఎం స్టాలిన్‌(CM Stalin) బుధవారం చెన్నై సెంట్రల్‌ నుంచి కాట్పాడికి రైలులో బయలుదేరారు. సీఎం కోసం దక్షిణ రైల్వే ఓ బోగీని ఓ చిన్న కార్యాలయంగా రూపొందించింది. ఇందులో సీఎం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఇరైఅన్బు సహా పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడా రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా వివిధ ఫైళ్లను పరిశీలిస్తూ, అధికారులను ఆదేశిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సెయింట్‌ జార్జి కోటలో రూపొందించే పథకాలు సాధారణ ప్రజలకు చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం ప్రతి క్షణం తనకెంతో విలువైనదని సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T10:05:58+05:30 IST