Tollywood: టాలీవుడ్లో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు కన్నుమూత
ABN , First Publish Date - 2023-02-02T09:39:05+05:30 IST
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు మరణించగా.. ఇటీవలే సీనియర్ నటి జమున కాలం చేశారు. ఆ విషయాన్ని పూర్తిగా మరువకముందే నేడు (ఫిబ్రవరి 2)న సీనియర్ దర్శకుడు విద్యా సాగర్ రెడ్డి (vidya sagar reddy) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ తరుణంలోనే నేటి ఉదయం 6 గంటలకు మరణించారు. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా.. విద్యా సాగర్ ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్కి పరిచయమయ్యారు. అనంతరం డాకు, స్టూవర్టుపురం దొంగలు (1991), ఓసి నా మరదలా (1997), రామసక్కనోడు (1999), అమ్మదొంగ (1995), అన్వేషణ (2002), యాక్షన్ నెం.1 (2002), ఖైదీ బ్రదర్స్ (2002) వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.