ఆ దేశంలో వేలమంది ముస్లింలు.. అయినా ఒక్క మసీదు కూడా లేదు... అది మన మిత్రదేశమే.. అక్కడ ఇటువంటి పరిస్థితి ఎందుకుందంటే...

ABN , First Publish Date - 2023-05-07T07:08:16+05:30 IST

మన దేశంలో ముస్లింల జనాభా అధికమనే సంగతి తెలిసిందే. అలాగే దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మసీదులు తప్పనిసరిగా కనిపిస్తాయి.

ఆ దేశంలో వేలమంది ముస్లింలు.. అయినా ఒక్క మసీదు కూడా లేదు... అది మన మిత్రదేశమే.. అక్కడ ఇటువంటి పరిస్థితి ఎందుకుందంటే...

మన దేశంలో ముస్లింల జనాభా అధికమనే సంగతి తెలిసిందే. అలాగే దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మసీదులు తప్పనిసరిగా కనిపిస్తాయి. అయితే మన పొరుగున ఉన్న ఆ దేశంలో కనీసం ఒక్క మసీదు(mosque) కూడా లేదు. మన మిత్రదేశమైన ఆ దేశం పేరు భూటాన్. ఈ దేశంలో మొత్తం జనాభా 7.5 లక్షలు, ఇందులో దాదాపు 7 వేల మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి మొత్తం జనాభాలో హిందువులు(Hindus) 11.3 శాతం. భూటాన్‌లో అనేక బౌద్ధ దేవాలయాలు, మఠాలు, హిందూ దేవాలయాలు(Temples) ఉన్నాయి.

అయితే ఇక్కడ ముస్లింల కోసం ఒక్క మసీదు కూడా లేదు. ఈ దేశంలో మసీదు మాత్రమే కాదు ఒక్క చర్చి కూడా లేదు. భూటాన్‌(Bhutan)లో అనేక వేల మంది క్రైస్తవులు(Christians) నివసిస్తున్నారు. అయితే అధికారికంగా వారికి ఇప్పటి వరకు చర్చిలను నిర్మించడానికి అనుమతి లేదు. యూరప్ లేదా మరే ఇతర దేశం నుండి ముస్లిం లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి భూటాన్‌ను సందర్శించడానికి వచ్చినప్పుడు వారు తమ ప్రార్థనా స్థలం(place of worship) లేక ఇబ్బందు పడుతుంటారు. అయితే అధికారికంగా బామ్‌తాంగ్‌(Bamthang)లో ఒక చిన్న ప్రార్థనా మందిరం నిర్మించారు.

ఇందులో మూడు గదులు ఉన్నాయి. ముస్లిం, సిక్కు, క్రైస్తవ మతాలను నమ్మే వారు ఈ మూడు వేర్వేరు గదులలో ప్రార్థనలు చేసుకోవచ్చు. అయితే భూటాన్‌లో హిందూ దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఈ హిందూ దేవాలయాలలో(Hindu temples) అతిపెద్దది భూటాన్ రాజధాని థింఫులో ఉంది. ఈ ఆలయంలో పలు హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి హిందువులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు(Prayers) చేస్తారు. భూటాన్ 7వ శతాబ్దం వరకు భారతదేశంలోని కూచ్ బెహార్ రాజవంశం(Dynasty of Cooch Behar)లో ఒక భాగంగా ఉంది. ఆ తర్వాత అది స్వతంత్రంగా మారి బౌద్ధమతం(Buddhism)లోకి మారింది.

Updated Date - 2023-05-07T09:39:10+05:30 IST