Pathaan: షారుక్‌ కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు...

ABN , First Publish Date - 2023-02-04T13:48:34+05:30 IST

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. షారుక్‌ సినిమా విడుదలైందీ అంటే అభిమానులకు కోలాహలమే!

Pathaan: షారుక్‌ కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు...

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు (Shah Rukh Khan) ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. షారుక్‌ సినిమా విడుదలైందీ అంటే అభిమానులకు కోలాహలమే! అతిథి పాత్రలు మినహాయిస్తే పూర్తిస్థాయిలో ఆయన తెరపై కనిపించి నాలుగేళ్లు అవుతుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘పఠాన్‌’ (Pathaan) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఈ సినిమా కోసం (Bangladesh to Tripura) అభిమానులు ఎగబడుతున్నారు. తాజాగా షారుక్‌ అభిమాని కుటుంబం చేసిన ఓ పని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బంగ్లాదేశ్‌లో ఉంటున్న ఓ ఫ్యామిలీ షారుఖ్‌ నటించిన ‘పఠాన్‌’ సినిమా చూసేందుకు చేసిన ప్రయత్పం ఔరా అనిపిస్తుంది. ‘పఠాన్‌‘ సినిమా చూేసందుకు బంగ్లాదేశ్‌లో నివాసం ఉంటున్న ఫిరోజ్‌ అహ్మద్‌ ఫ్యామిలీ ఢాకా నుంచి త్రిపురలోని అగర్తాలకు వచ్చింది. ఈ విషయాన్ని ఫిరోజ్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ఈ పోస్టును అగర్తలాలోని రూపసి సినిమా హాల్‌ యజమాని సతాదీప్‌ సాహ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ఇది గొప్ప విషయం.. ప్రేక్షకులు ‘పఠాన్‌’ సినిమా చూడటానికి బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వస్తున్నారు. అగర్తలా త్రిపురను, రూపసి సినిమాస్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కు ఫిరోజ్‌ రిప్లై ఇచ్చారు. ‘‘హాయ్‌ సతాదీప్‌, మా పోస్ట్‌ను అందరికీ షేర్‌ చేసినందుకు థ్యాంక్స్‌. నేను భారతదేశానికి చెందిన వాడిని. నా కుటుంబంతో కలిసి బంగ్లాదేశ్‌లో ఉంటూ, అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. బంగ్లాదేశ్‌ సర్కార్‌ కొన్ని కారణాల వల్ల ‘పఠాన్‌’ సినిమాను విడుదల చేయకూడదని ఆదేశించింది. షారుక్‌ ఖాన్‌ మీద ఉన్న అభిమానంతో సమీపంలో ఉన్న ఓ నగరానికి వెళ్లి సినిమా చూడాలనుకున్నాం. షారుక్‌ తదుపరి చిత్రం ‘జవాన్‌’ను కూడా భారత్‌లోనే చూడాలని ప్ల్లాన్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు. (Shah Rukh Khan's fans travel from Bangladesh to Agartala to watch Pathaan)

2.jpg

స్పై థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టినా వసూళ్ల సునామీ తగ్గలేదు. మొదటివారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళు చేసిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సిద్థార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌ గా నటించగా, జాన్‌ అబ్రహాం నెగటివ్‌ షేడున్న పాత్ర పోషించారు.

Updated Date - 2023-02-04T13:49:56+05:30 IST