Siddharth Anand: పాన్ ఇండియా పిక్!

ABN , First Publish Date - 2023-02-01T20:27:54+05:30 IST

‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). తాజాగా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ కు దర్శకత్వం వహించారు.

Siddharth Anand: పాన్ ఇండియా పిక్!

‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). తాజాగా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ ను తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌కు వెలుగులను తీసుకువచ్చింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.500కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘పఠాన్’ (Pathaan) భారీ విజయం సాధించడంతో మైత్రీ మూవీస్ అధినేత నవిన్ యెర్నెనీ (NaveenYerneni) డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పారు. అందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ సిద్దార్థ్ ఆనంద్‌కు చాలా కాలం క్రితమే అడ్వాన్స్ ఇచ్చింది. ప్రభాస్‌తో కాంబినేషన్‌ను కుదిర్చింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ సినిమాను నిర్మించనున్నట్టు చెప్పింది. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ఆనంద్‌ను నిర్మాత నవిన్ యెర్నెనీ కలిశారు. శుభాకాంక్షలు చెప్పి సరదాగా ముచ్చటించారు. ప్రభాస్ ప్రాజెక్టు గురించి కూడా చర్చించారని సమాచారం అందుతుంది. ఈ సినిమా 2024లో పట్టాలెక్కే అవకాశం ఉంది. థియేటర్స్‌లో 2025లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం ‘ఫైటర్’ (Fighter) ను తెరకెక్కిస్తున్నారు. హృతిక్ హీరోగా నటిస్తున్నారు. స్పై ఏరియల్ థ్రిల్లర్‌గా మూవీ రూపొందుతుంది.

Updated Date - 2023-02-01T20:28:53+05:30 IST