Murder Mystery: మా అమ్మను నేను చంపలేదు.. భయపడి ముక్కలుగా చేసి దాచానంతే.. 24 ఏళ్ల కూతురి మాటలతో పోలీసులకు టెన్షన్..!

ABN , First Publish Date - 2023-03-18T18:38:48+05:30 IST

అనుమానాస్పద స్థితిలో మరణించిన మహిళ.. మిస్టరీగా మారిన కేసు

Murder Mystery: మా అమ్మను నేను చంపలేదు.. భయపడి ముక్కలుగా చేసి దాచానంతే.. 24 ఏళ్ల కూతురి మాటలతో పోలీసులకు టెన్షన్..!

ఇంటర్నెట్ డెస్క్: మా అమ్మను నేను చంపలేదు.. భయపడి ముక్కలుగా చేసి దాచానంతే.. ఇవీ మృతురాలి కూతురు పోలీసులతో అన్న మాటలు. ఆమె తల్లి అనుమానాస్పద రీతిలో మరణించింది. కానీ తల్లిని తాను చంపలేదని కూతురు ఘంటాపథంగా చెబుతోంది. తన తల్లి పైఅంతస్తు నుంచి కిందపడి మృతి చెందిందని పేర్కొంది. అయితే.. తన నిర్లక్ష్యం వల్లే తల్లి మరణించిందని బంధువులు ఆరోపిస్తారనే భయంతోనే తాను ఆమె శరీరాన్ని వదిలించుకునే ప్రయత్నం చేశాయని చెప్పుకొచ్చింది. మహారాష్ట్రలో గతేడాది వెలుగు చూసి ఈ ఘటన ప్రస్తుతం పోలీసులకూ సవాలుగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో నివసించే వీణ జైన్ గతేడాది డిసెంబర్‌ 27న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నిర్జీవంగా పడి ఉన్న ఆమెను గుర్తించిన ఇరుగుపొరుగు వారు ఆమె కూతురు రింపుల్‌కు సమాచారం ఇచ్చారు. వీణాను ఆమె ఇంట్లోకి చేర్చి వెళ్లిపోయారు. ఆ తరువాత కొద్ది రోజులకు వీణా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ముక్కలుగా నరికిన ఆమె శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఈ విషయమై వీణ కూతురు రింపుల్‌ను ప్రశ్నించగా పోలీసులకు షాకిచ్చే సమాధానం చెప్పింది. తల్లిని తాను చంపలేదని చెప్పుకొచ్చిన ఆమె ఆమె శరీరాన్ని వదిలించుకునేందుకే ముక్కలుగా నరికానని చెప్పింది. ప్రస్తుతం రింపుల్ పోలీసుల కస్టడీలోనే ఉంది. మార్చి 14 పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇక వీణ ప్రమాదవశాత్తూ మృతి చెందిందా? లేక ఎవరైనా చంపారా? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం దొరకలేదు. అయితే.. వీణ మరణం తరువాత ఆమె కూతురుతో ఓ వ్యక్తి పలుమార్లు సంభాషించాడు. దీంతో..పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో పురోగతి లేక పోలీసులకూ టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకాలం పాటు మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-03-18T18:38:48+05:30 IST