Chiranjeevi: నిర్మాతల డబ్బును వృథా చేయొద్దు.. దర్శకులకి మెగాస్టార్ హితవు

ABN , First Publish Date - 2023-01-14T17:31:37+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar chirajeevi) నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). బాబీ కొల్లీ (Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం..

Chiranjeevi: నిర్మాతల డబ్బును వృథా చేయొద్దు.. దర్శకులకి మెగాస్టార్ హితవు
Waltair Veerayya

మెగాస్టార్ చిరంజీవి (Megastar chirajeevi) నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). బాబీ కొల్లీ (Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఈ తరుణంలో ఈ మూవీ టీం తాజాగా సక్సెస్‌మీట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నిర్మాతల డబ్బును వృథా చేయొద్దని దర్శకులకి హితవు పలికారు.

chiru.jpg

చిరంజీవి మాట్లాడుతూ.. ‘నిర్మాతలు బావుంటేనే పరిశ్రమ బాగుంటుంది. దర్శకులు బాధ్యతాయుతంగా ఉండాలి. నిర్మాతల డబ్బును వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే నిర్మాతలు బావుంటారు. దానివల్ల పరిశ్రమ బావుంటుంది. అందుకే పరిశ్రమ బాగుండేలా దర్శకులు ఆలోచించాలి’ అని తెలిపారు. అలాగే వాల్తేరు వీరయ్య మూవీ విజయం అందరి సమిష్టి కృషి అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించారు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రని పోషించారు.

Updated Date - 2023-01-14T19:07:21+05:30 IST