UP: భార్యను చంపి చెట్ల పొదల్లో పడేసి ఏమీ ఎరుగనట్టు ఇంటికి తిరిగొచ్చేశాడు.. కానీ రెండో రోజే నిజం ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2023-01-26T20:10:40+05:30 IST

భార్యను చంపి ఏమీతెలీనట్టు నాటకమాడిన ఓ భర్త చివరకు పోలీసులకు చిక్కాడు.

UP: భార్యను చంపి చెట్ల పొదల్లో పడేసి ఏమీ ఎరుగనట్టు ఇంటికి తిరిగొచ్చేశాడు.. కానీ రెండో రోజే నిజం ఎలా బయటపడిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పోలంలో భార్యను చంపి పొదల్లో పడేసి ఏమీ ఎరుగనట్టు ఇంటికొచ్చేశాడో వ్యక్తి. ఆ తరువాత తనే స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన నేరం బయటపడదని అనుకున్నాడు. కానీ .. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడి గుట్టు బయటపెట్టడంతో అతడు బోరుమన్నాడు. తానే భార్య ప్రాణం తీశానంటూ నేరాన్ని అంగీకరించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(Uttarpradesh) ఘాన్సీ జిల్లాకు(Jhansi) చెందిన సూరజ్‌భాన్, రజనీ దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ.. ఏడాదిగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. మరోవ్యక్తితో రజనీ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెతో గొడవపడేవాడు. జనవరి 23న కూడా వారి మధ్య వివాదం చెలరేగింది. ఆ తరువాత.. రజనీ పశుగ్రాసం కోసం పోలానికి వెళ్లింది. భర్త కూడా ఆమె వెంట వెళ్లాడు. పొలంలో వారిద్దరూ మళ్లీ గొడవపడ్డారు.

ఈ క్రమంలో సూరజ్‌భాన్ ఆమె మెడను తాడుతో బిగించి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని పొదల్లో పడేసి ఏమీ ఎరగనట్టు ఇంటికొచ్చేశాడు. ఆ తరువాత..చీకటిపడుతున్నా భార్య ఇంటికి తిరిగిరాలేదంటూ కుటుంబసభ్యుల వద్ద గగ్గోలు పెట్టాడు. దీంతో..అంతా కలిసి పొలంలో వెతగ్గా.. మళ్లీ అతడే భార్య శవాన్ని వారికి చూపించి నటకాన్ని రక్తికట్టించాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు.. సూరజ్ భాన్ హత్య చేశాడంటూ ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు చెప్పడంతో నిందితుడి నాటకానికి రెండో రోజే తెరపడింది.

Updated Date - 2023-01-26T20:16:37+05:30 IST