Kriti Sanon: ‘ఆదిపురుష్’ పై ఆసక్తికర కామెంట్స్

ABN , First Publish Date - 2023-02-16T20:42:24+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘దిల్ వాలే’, ‘లూకా చప్పీ’, ‘మిమి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Kriti Sanon: ‘ఆదిపురుష్’ పై ఆసక్తికర కామెంట్స్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘దిల్ వాలే’, ‘లూకా చప్పీ’, ‘మిమి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ స్థిరపడిపోయారు. తాజాగా పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush)లో నటించారు. ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కృతి సనన్ తాజాగా ‘షెహజాదా’ (Shehzada) లో నటించారు. కార్తిక్ ఆర్యన్‌కు జోడీగా కనిపించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కృతి ‘షెహజాదా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్‌లోనే ‘ఆది పురుష్’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించినందకు నాకు గర్వంగా ఉంది. ఓం రౌత్ (Om Raut) అద్భుతంగా తెరకెక్కించారు. దేశం మొత్తం గర్విస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని కృతి సనన్ చెప్పారు. రామాయణాన్ని ఆధారంగా ‘ఆదిపురుష్’ ను రూపొందించారు. టి- సిరీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్‌అలీ ఖాన్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే అయోధ్యలో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్‌ ఆశించిన స్థాయిలో లేవని అనేక మంది నెటిజన్స్ తెలిపారు. అందువల్ల సంక్రాంతికి విడుదల కావాల్సి చిత్రాన్ని వాయిదా వేశారు. జూన్‌ 16న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అదే రోజు హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘ప్లాష్’ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది.

Updated Date - 2023-02-16T20:42:25+05:30 IST