Janhvi Kapoor: నెపోకిడ్ ట్యాగ్‌పై స్పందించిన జాన్వీ

ABN , First Publish Date - 2023-02-08T17:51:35+05:30 IST

సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ (Dhadak) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

Janhvi Kapoor: నెపోకిడ్ ట్యాగ్‌పై స్పందించిన జాన్వీ

సినీ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ (Dhadak) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ అందాల భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో కొంత మంది నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. నెపో కిడ్ అని విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ ట్రోల్స్, విమర్శలపై జాన్వీ కపూర్ తాజాగా స్పందించారు.

‘‘నా మీద వచ్చే విమర్శలు, ట్రోల్స్‌కు నేను భయపడను. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. నా చివరి రెండు చిత్రాల ద్వారా నటిగా నేను నిరూపించుకున్నాను. ఇప్పటికైనా నటించడం వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను చెమటోడ్చి, కష్టించి పనిచేసినప్పుడు ఎవరో వ్యక్తి నాపై విమర్శలు గుప్పించినప్పుడు మాత్రం బాధేస్తుంది. ‘మిలీ’ (Mili)లో నా నటనను మెచ్చుకుని, తర్వాతి చిత్రానికి మరింతగా మెరుగు పర్చుకోవచ్చు అని చెప్పినప్పుడు సంతోషంగా ఉంటుంది. కొంత మంది నేను నటించిన చిత్రాలను చూడకుండానే విమర్శిస్తుంటారు. అటువంటప్పుడు బాధగా ఉంటుంది’’ అని జాన్వీ కపూర్ చెప్పారు. జాన్వీ కపూర్ నుంచి 2022లో రెండు సినిమాలు వచ్చాయి. ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు మూవీస్‌లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆమె త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ‘ఎన్‌టీఆర్ 30’ లో హీరోయిన్‌గా ఎంపికయిందని సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Updated Date - 2023-02-08T17:53:32+05:30 IST