మనుషులను మింగేస్తున్న జీవులు... పులులు, సింహాలు, మెసళ్లు.. చివరికి కుక్కలు కూడా కాదు.. ఈ అతి చిన్నజీవి లక్షల మందిని పొట్టనపెట్టుకుంటున్నదని తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-05T07:18:28+05:30 IST

ప్రపంచంలో ప్రతీఏటా కొన్ని జీవులు(living beings) ఎంతమంది మనుషులను పొట్టన పెట్టుకుంటున్నాయో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

మనుషులను మింగేస్తున్న జీవులు... పులులు, సింహాలు, మెసళ్లు.. చివరికి కుక్కలు కూడా కాదు.. ఈ అతి చిన్నజీవి లక్షల మందిని పొట్టనపెట్టుకుంటున్నదని తెలిస్తే...

ప్రపంచంలో ప్రతీఏటా కొన్ని జీవులు(living beings) ఎంతమంది మనుషులను పొట్టన పెట్టుకుంటున్నాయో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సింహం(lion), పులి మొదలైన జంతువులను చూడగానే మనకు విపరీతమైన భయం కలుగుతుంది. సైన్స్ ఫోకస్(Science focus) నివేదిక ప్రకారం సింహం, పులులు సంవత్సరానికి 200 మందిని చంపుతున్నాయి.

ఇటీవలి కాలంలో కుక్కల దాడుల(Dog attacks) ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కుక్క కాటు కారణంగా 60 వేల మంది(60 thousand people) మరణిస్తున్నారు. నీటిలో నివసించే మొసళ్లు ఒక సంవత్సరంలో 600 మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ఏనుగులు(elephants) ప్రతి సంవత్సరం 600 మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఒక లక్షా 38 వేల మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారు.

అస్సాస్సిన్ బగ్స్(Assassin bugs) అనే కీటకం 10,000 మంది మరణానికి కారణమవుతోంది. తేలు కాటు(Scorpion bite) కారణంగా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 3 వేల మందికి పైగా జనం మరణిస్తున్నారు. దోమల కారణంగా(mosquitoes) ప్రతి సంవత్సరం 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Updated Date - 2023-04-05T07:55:33+05:30 IST