Mahesh babu : వెరిఫికేషన్‌ కోసం హైటెక్‌ సిటీలో...

ABN , First Publish Date - 2023-02-09T18:15:05+05:30 IST

సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల హంగామాను మాటల్లో చెప్పలేం. అభిమాన హీరో కనిపిస్తే చాలు ఎగబడి చూస్తారు. అందుకే సెలబ్రిటీలు ప్రైవసీగా ఉంటారు. ఎక్కువగా బయట కనిపించడానికి ఇష్టపడరు.

Mahesh babu : వెరిఫికేషన్‌ కోసం హైటెక్‌ సిటీలో...

సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల హంగామాను మాటల్లో చెప్పలేం. అభిమాన హీరో కనిపిస్తే చాలు ఎగబడి చూస్తారు. అందుకే సెలబ్రిటీలు ప్రైవసీగా ఉంటారు. ఎక్కువగా బయట కనిపించడానికి ఇష్టపడరు. ఆ కారణంతోనే ఎక్కువశాతం ప్రైవసీ కోసం విదేశాలకు వెళ్తుంటారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Maheshbabu) విషయానికొస్తే ఆయనకు ఖాళీ దొరికితే ఎక్కువ శాతం విదేశాలకు వెళ్లడానికే ఇష్టపడుతుంటారు. ఖాళీ సమయంలో ఆయన హైదరాబాద్‌లో (Mahesh babu at hitec city) కనిపించేది చాలా తక్కువ. తాజాగా మహేశ్‌ హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో కనిపించారు. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన పని చూసుకుని వెళ్లారు. అది షూటింగ్‌ కోసం అనుకుంటే పొరపాటే! ఇంతకీ హైటెక్‌ సిటీకి ఎందుకు వెళ్లారంటే.. ఆయన వ్యక్తిగత పని మీద హైటెక్‌ సిటీలోని ఆధార్‌ ఆఫీస్‌కు వెళ్లారు. తన ఆధార్‌ కార్డ్‌కు సంబంధించి వెరిఫికేషన్‌ కోసం దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్‌ కార్డు వెరిఫికేషన్‌ ఆఫీస్‌కు హాజరయ్యారు. ఆ పని కాగానే సైలెంట్‌గా వెళ్లిపోయారు మహేశ్‌. అయితే ఆఫీస్‌లో ఆధార్‌ వెరిఫికేషన్‌ (Mahesh adhar verificatrion) చేసుకుంటున్నా దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు అక్కడి సిబ్బంది ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో లాంగ్‌ హెయిర్‌ కట్‌, క్యాజువల్‌ షర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి28’ (SSMB28)చిత్రంతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

Updated Date - 2023-02-09T18:15:11+05:30 IST