జైల్లో ‘చిప్ప కూడు’ అని తేలిగ్గా అనేస్తారు.. నిజానికి ఖైదీలకు ఎటువంటి ఆహారం పెడతారో... ఇంకేమి వెసులుబాట్లు కల్పిస్తారో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-06T11:37:27+05:30 IST

దేశంలో ఖైదీలకు ఎలాంటి ఆహారం ఇస్తారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడివుంటుంది. మనదేశంలో జైళ్లను నిర్వహించే హక్కు రాష్ట్రాలకు ఉంది.

జైల్లో ‘చిప్ప కూడు’ అని తేలిగ్గా అనేస్తారు.. నిజానికి ఖైదీలకు ఎటువంటి ఆహారం పెడతారో... ఇంకేమి వెసులుబాట్లు కల్పిస్తారో తెలిస్తే...

దేశంలో ఖైదీలకు ఎలాంటి ఆహారం ఇస్తారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడివుంటుంది. మనదేశంలో జైళ్లను నిర్వహించే హక్కు రాష్ట్రాలకు ఉంది. NCRB (నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో) 2015 డేటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు సగటున ఒక్కో ఖైదీకి ఆహారం కోసం రోజుకు రూ.52.42 ఖర్చు చేస్తున్నాయి. ఇందులో ఖైదీలకు అల్పాహారంతో సహా 3 సార్లు ఆహారం అందిస్తారు.

పలు నివేదికల ప్రకారం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు ఖైదీల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు సగటు కంటే తక్కువ ఖర్చు చేస్తున్నాయి. మగ ఖైదీలు 2320 కేలరీలు, మహిళలు రోజుకు 1900 కేలరీలు ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన మోడల్ ప్రిజన్ మాన్యువల్‌లో మార్గదర్శకాలను ఇచ్చింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు జైళ్ల ఆహార మెనూను నిర్ణయిస్తాయి. ఖైదీలకు పప్పు, 6 రోటీలు, సాధారణ అన్నం అందిస్తారు. కొన్ని జైళ్లలో రాజ్మా లాంటి ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారు. కొంతమంది ఖైదీలు తమకు ఇచ్చిన ఆహారాన్ని పంచుకుని తింటారు. కొంతమంది ఖైదీలకు బయటి నుంచి కూడా ఆహారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

అయితే దీని కోసం కోర్టు నుండి ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది. జైలు పేరు వినగానే తిండి లేకపోవడమేమోనని చాలామంది అనుకుంటారు. సాధారణంగా జైల్లో నాన్ వెజ్ ఫుడ్ దొరకదు. చాలా జైళ్లకు వివిధ రకాల కూరగాయలు, పప్పు, రోటీ, బియ్యం లాంటి సాధారణ ఆహారం సరఫరా అవుతుంది. కొన్ని జైళ్లలోని ఖైదీలకు క్యాంటీన్ నుండి నాన్ వెజ్ కొనుగోలుచేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఖైదీ తన కుటుంబం నుండి నెలకు రూ. 2000 వరకు పొందవచ్చు. ఖైదీలు జైలులో పని చేసినందుకు ప్రతిగా డబ్బు అందుకుంటారు. ఈ డబ్బుతో ఖైదీ క్యాంటీన్‌లో ఆహారం కొనుక్కొవచ్చు.

Updated Date - 2023-03-06T11:38:57+05:30 IST