NRI: జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-02-06T18:22:06+05:30 IST

జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం ఆధ్యర్యంలో వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి వేడుకలు, ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిగాయి.

NRI: జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

ఘంటసాల కారణజన్ముడని ప్రముఖ సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం ఆధ్యర్యంలో సంక్రాంతి వేడుకలు, ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను మేం మర్చిపోతున్నా మీరు కొనసాగిస్తుండటం అభినందనీయం. ఘంటసాల శతజయంతి ఉత్సవాలు వంటివి సినిమా వాళ్లుగా మేం చేయలేనందుకు సిగ్గుపడుతున్నాం. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తుంచుకోవాలి. జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలు ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపాయి. ఇంత బాగా నిర్వహించిన సంస్థ అధ్యక్షులు కృష్ణ లాంను అభినందించారు’’ అని అన్నారు.

3.jpgకృష్ణ లాం మాట్లాడుతూ.. ‘‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల. సినీవినీలాకాశంలో ఆయన ధృవతారగా వెలుగొందారు. ఆయన ఆలపించిన భగవద్గీత నభూతో నభవిష్యత్. అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు జరుపుకునే అవకాశం రావడం మన అదృష్టం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో అనేక సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు మానవ సంబంధాలకు వేదిక. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ అందరం కలుసుకుని ఈ పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారి రవి కోట మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతిని, పల్లె క్రాంతిని దర్శించుకోవడమని అభివర్ణించారు. తెలుగువారి పండుగైన సంక్రాంతి ప్రజలకు ఎన్నో అనుభూతులు మిగులుస్తుందన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఏ జాతైతే తన మాతృభాషను, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుందని చెప్పారు. ‘‘భాష నాగరికతను నేర్పిస్తుంది. ముఖ్యంగా భాషే ఒక సాంస్కృతిక వారథి’’ అని వ్యాఖ్యానించారు.

డాక్టర్ ముల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ సంక్రాంతి ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పండుగని అన్నారు. ఈ పర్వదిన విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తానా బోర్డు మాజీ అధ్యక్షులు నరేన్ కొడాలి, అనిల్ ఉప్పలపాటి తదితరులు ప్రసగించారు. తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన ఫోన్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

పండుగ వాతావరణం సంతరించకునేలా సంక్రాంతి శోభ ఉట్టిపడుతూ చేసిన అలంకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంగవల్లులు, ముగ్గులపోటీలు, పెళ్లిభోజనాలను తలపించేలా తాంబూలంతో కూడిన సహపంక్తి భోజనాలను నిర్వహకులు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వాధ్యక్షులు సత్యనారాయణ మన్నె, రవి గవిరినేని, సాయిసుధ పాలడుగు, కిషోర్ తంగేటి, జీడబ్ల్యూటీసీఎస్ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నె, విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, కార్తీక్ కోమటి, రవి అడుసుమిల్లి, శ్రీవిద్య సోమ, భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, చంద్ర మలావతు, రాజేష్ కాసరనేని, ఉమాకాంత్ రఘుపతి, ఫణి తాళ్లూరి, శ్రీనివాస్ గంగ, ప్రవీణ్ కొండక, పాల్గొన్న ఇతర ప్రముఖులు రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి, విజయ్ గుడిసేవ, సాయి బొల్లినేని తదితరులు పాల్గొన్నారు.

4.jpg6.jpg7.jpg1.jpg

Updated Date - 2023-02-06T18:23:11+05:30 IST