భారత్‌లో మతస్వేచ్ఛకు విఘాతం

ABN , First Publish Date - 2023-09-22T02:43:38+05:30 IST

భారత్‌లో మత, మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, క్రమేణా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని ఐక్యరాజ్య సమితి మైనార్టీ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్‌ డి వెరెన్నెస్‌ ఆందోళన

భారత్‌లో మతస్వేచ్ఛకు విఘాతం

అమెరికా కమిషన్‌కు ఐరాస ప్రతినిధి వెల్లడి

వాషింగ్టన్‌, సెప్టెంబరు 21: భారత్‌లో మత, మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, క్రమేణా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని ఐక్యరాజ్య సమితి మైనార్టీ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్‌ డి వెరెన్నెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎ్‌ససీఐఆర్‌ఎ్‌ఫ)కు ఈ విషయం తెలిపారు. భారత్‌లోని పరిస్థితి ‘భారీగా, స్థిరంగా, ప్రమాదకరంగా’ ఉందని మూడు పదాల్లో అభివర్ణించారు. భారత్‌లో మత స్వేచ్ఛ అంశంపై బుధవారం విచారణ జరిపినట్టు యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్‌ వెల్లడించింది. కాగా యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్‌ ఇంతకుముందు కూడా చేసిన ఈ ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఆ నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని పేర్కొంది.

Updated Date - 2023-09-22T02:43:38+05:30 IST