ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాక రెపరెపలు

ABN , First Publish Date - 2023-01-27T02:51:39+05:30 IST

భారత 74వ గణతంత్ర వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు కూడా భారత్‌కు

ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాక రెపరెపలు

లండన్‌, జనవరి 26: భారత 74వ గణతంత్ర వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు కూడా భారత్‌కు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు... ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌.. భూటాన్‌ ప్రధాని లోటో టెహ్రింగ్‌... యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌లు భారత్‌తో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లోని ఇండియా హౌస్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ ఘనంగా జరిగింది.

Updated Date - 2023-01-27T02:51:40+05:30 IST