MBBS: గంగానదిలో మునిగి ముగ్గురు మెడికోలు మృతి

ABN , First Publish Date - 2023-02-19T23:09:27+05:30 IST

శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన జరిగింది.

MBBS: గంగానదిలో మునిగి ముగ్గురు మెడికోలు మృతి
Three Medical Students Drown While Bathing In Ganga In Uttar Pradesh

లక్నో: శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) విషాదకర ఘటన జరిగింది. బదౌన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు (MBBS students) బదౌన్ కచ్లా గంగా ఘాట్ వద్ద గంగానదిలో (Ganga) ఈతకు దిగి మృతిచెందారు. మొత్తం ఐదు మంది ఈతకు వెళ్లగా ఇద్దరిని గజఈతగాళ్లు కాపాడారు. మిగతా ముగ్గురు గంగానదిలోకి దిగి ఈతరాక మునిగిపోయారు. ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజఈతగాళ్లు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను జై మౌర్య, నవీన్ సాగర్, పవన్ యాదవ్‌గా గుర్తించారు. వీరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-02-19T23:12:17+05:30 IST