భర్తను, అత్తను ముక్కలుగా నరికిన మహిళ!

ABN , First Publish Date - 2023-02-21T03:40:43+05:30 IST

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన శ్రద్ధావాకర్‌, నిక్కీ యాదవ్‌ తరహా హత్యలు ఇప్పుడు మరిన్ని వెలుగుచూస్తున్నాయి.

భర్తను, అత్తను ముక్కలుగా నరికిన మహిళ!

ప్రియుడితో కలిసి మేఘాలయలో అవయవాల విసిరివేత

గువాహతి, ఫిబ్రవరి 20: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన శ్రద్ధావాకర్‌, నిక్కీ యాదవ్‌ తరహా హత్యలు ఇప్పుడు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్‌లో పెళ్లైన ప్రియురాలిని ప్రియుడు ఇటీవల ముక్కలుగా నరికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసోంలోనూ ఆ తరహా ఘోరం జరిగింది. అయితే.. ఇక్కడ నిందితురాలు ఓ మహిళ కావడం గమనార్హం. రాష్ట్రంలోని నూన్‌మతి ప్రాంతానికి చెందిన వందన కలీతాకు అమర్‌జ్యోతి దే అనే వ్యక్తితో పెళ్లైంది. అయితే.. గత కొన్నాళ్లుగా ఆమె మరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, అత్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం వారి శరీరాల్ని ముక్కలుగా కోసి ఇంట్లోని ఫ్రిజ్‌లో భద్రపరిచింది. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రియుడితో కలిసి మేఘాలయలోని చిరపుంజికి వెళ్లి ఆ భాగాలను విసిరేసింది.

Updated Date - 2023-02-21T03:40:44+05:30 IST