సిద్దూ సలహాదారుగా సునీల్‌ కనుగోలు

ABN , First Publish Date - 2023-06-01T01:01:31+05:30 IST

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రె స్‌కు వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సునీల్‌ కనుగోలుకు పార్టీ నాయకత్వం పెద్ద బహుమానమే ఇచ్చింది.....

సిద్దూ సలహాదారుగా సునీల్‌ కనుగోలు

బెంగళూరు, మే 31: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రె స్‌కు వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సునీల్‌ కనుగోలుకు పార్టీ నాయకత్వం పెద్ద బహుమానమే ఇచ్చింది. సునీల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన సలహాదారుగా క్యాబినెట్‌ హోదాతో నియమించింది. కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ఏడాది క్రితం నియమితుడైన సునీల్‌ కనుగోలు.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై ‘40 శాతం కమిషన్‌ సర్కారు’ వంటి కీలక అంశాలను ఆ పార్టీకి అస్త్రాలుగా అందించారు. కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్‌ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రె్‌సకు సునీల్‌ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తుండగా.. ఆయన కార్యాలయంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-06-01T01:01:31+05:30 IST