విశేష పరిశోధకులకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్
ABN , First Publish Date - 2023-09-22T02:47:35+05:30 IST
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు వివిధ విభాగాలు ఇస్తున్న సుమారు 300 అవార్డులను రద్దు చేసి నూతనంగా ఈ అవార్డులకు రూపకల్పన చేసింది. దీని ప్రకారం విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీం పేరుతో నాలుగు రకాల పురస్కారాలను ప్రదానం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన శాస్త్ర రంగాల సలహాదారు ఆధ్వర్యంలోని బృందం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. విదేశాల్లోని భార త సంతతి వారు కూడా వీటికి అర్హులే. ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నవారితో పాటు వ్యక్తిగతంగా పరిశోధనలు చేసేవారిల్లో అర్హులను గుర్తిస్తారు.