కేంద్ర రక్షిత స్మారకాల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:43 AM
పురాతన కట్టడాలు, ప్రదేశాలు, అవశేషాలు చట్టం (ఏఎంఏఎ్సఆర్)లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. పురావస్తు ప్రదేశాల రక్షణలో
కొండంత టార్చ్లైట్తో చీకట్లో అంతరిక్షంలోకి తొంగిచూస్తున్నట్లుంది కదూ.. ఈ చిత్రం. ఇది చిలీ దేశంలోని అగ్ని పర్వతం. పేరు విల్లారికా. కొంతకాలంగా ఈ అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతూ చీకట్లో ఇలా కనిపిస్తోంది.
స్థానిక సంస్థలకు అధికారాలివ్వాలి
పార్టమెంటరీ సంఘం నివేదిక
న్యూఢిల్లీ, డిసెంబరు 17: పురాతన కట్టడాలు, ప్రదేశాలు, అవశేషాలు చట్టం (ఏఎంఏఎ్సఆర్)లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. పురావస్తు ప్రదేశాల రక్షణలో సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ పటిష్ఠమైన నిబంధనలు రూపొందించాలని కమిటీ సూచించింది. చారిత్రక కట్టడాల పరిరక్షణకు స్థానిక సంస్థలకు అధికారాలను ఇవ్వడం అవసరమని రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటయిన పార్టమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. స్థాయీసంఘం నివేదికను గతవారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ఏఎంఏఎ్సఆర్ చట్టం కింద 3,690 పురావస్తు ప్రదేశాలు భారతీయ పురావస్తు విభాగం(ఏఎ్సఐ) పరిధిలో ఉన్నాయి. ‘‘కేంద్ర రక్షణలోని స్మారక ప్రదేశాలు ఆక్రమణలకు గురవుతున్నప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహించిన అధికారులను ప్రాసిక్యూట్ చేసే దిశగా చట్టంలో మార్పులు తేవాలి. అటవీ పరిరక్షణ చట్టం 1972 ప్రకారం జిల్లా అటవీశాఖ అధికారులకు ఉన్న అధికారాలు ఏఎ్సఐ అధికారులకు ఇస్తే పరిరక్షణ సాధ్యమవుతుంది’’ అని కమిటీ సూచించింది.